పుండువిూద కారంచల్లి సంతోషిస్తున్నారు

– రాష్ట్రంలో కష్టాలు, ఇబ్బందులకు మోడీనే కారణం

– హావిూలు అమలుచేసుంటే ఇన్ని ఇబ్బందులుండేవి కావు

– అయినా మనశక్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం

– 2029 నాటికి దేశంలో నెం.1 రాష్ట్రంగా నిలుస్తాం

– కేసీఆర్‌కు అవినీతి తమ్ముడు జగన్‌ తోడయ్యాడు

– వందమంది కేసీఆర్‌, జగన్‌లు కలిసినా ఏపీని ఏవిూ చేయలేరు

– ఎన్టీఆర్‌ వైద్యసేవ పరిమితి రూ.5లక్షలకు పెంపు

– పేద ప్రజలే దేవుళ్లని నిర్వచించిన మహావ్యక్తి ఎన్టీఆర్‌

– చరిత్రలో మళ్లీ అలాంటి యుగపురుషుడు పుట్టడు

– సత్తెనపల్లి సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

– 36అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరించిన ఏపీ సీఎం

గుంటూరు, జనవరి18(జ‌నంసాక్షి) : విభజన జరిగినప్పుడు అందరూ భయపడ్డారని, విభజనతో దగాపడ్డాం.. నష్టపోయామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అండగా ఉంటారని ఎన్డీఏలో భాగస్వాములయ్యామని, న్యాయం చేస్తారని నమ్మితే ఎన్డీఏ నమ్మక ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయం చేయకపోగా పుండువిూద కారంచల్లి సంతోషిస్తున్నారని కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ పార్కు, వావిలాల ఘాట్‌ ప్రారంభించారు. ఎన్టీఆర్‌ సాగర్‌లో సభాపతి కోడెల శివప్రసాద్‌రావుతో కలిసి బోటులో విహరించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సత్తెనపల్లి జడ్పీ బాలికల పాఠశాలలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు.. ఎన్టీఆర్‌ ఒక మహానాయకుడు, యుగపురుషుడు అని కొనియాడారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామసాగర్‌ ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్‌ హయాంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటైందన్నారు.

వందమంది కేసిఆర్‌, జగన్‌ లు కలిసినా ఆంధప్రదేశ్‌ ను ఏవిూ చేయలేరని అన్నారు. నాకేదో గిప్ట్‌ ఇస్తానని కేసిఆర్‌ బెదిరిస్తున్నాడని.. కేసిఆర్‌ ఒక్క గిప్ట్‌ ఇస్తే తెలుగు ప్రజలు మూడు గిప్ట్‌ లు ఇస్తారన్నారు. కేసిఆర్‌ కు అవినీతి తమ్ముడు జగన్‌ తోడయ్యాడని విమర్శించారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే, ఈడి కేసులు.. ఐటి దాడులతో బెదిరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్టీఆర్‌ స్పూర్తి తో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన హావిూలు అమలు చేస్తామన్న కేంద్రం సహకరించడం లేదని, రివైజ్‌లు ఆర్థిక ఇబ్బందులున్నాయని.. కేంద్రం నిధులు ఇవ్వడంలేదని అయినా ప్రాజెక్టులకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయని, దానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేస్తున్నామన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా 8శాతం సేద్యం సాధించిన ఏకైక ప్రభుత్వం మనదేనని అన్నారు. రైతులకు రూ. 24 కోట్ల రుణ విముక్తి చేసిన ప్రభుత్వం టీడీపీయేనని, రూ. లక్షా 50 వేలు రుణమాఫీ చేశామని, వాళ్ల కంటే ఒకడుగు ముందుంటానని చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరించకపోయినా ఏపీని మన స్వశక్తితో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. 2022 నాటికి దేశంలో మూడు అభివృద్ధి రాష్ట్రాల్లో ఏపీ ఉంటుందని, 2029

నాటికి దేశంలోనే నెం.1 రాష్ట్రంలో ఏపీని తయారుచేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం టీడీపీ సర్కార్‌ అని అన్నారు. సమాజంలో అనేక ఇబ్బందులు పడుతున్నా.. ముందుకు వెళ్లడానికి భరోసా ఇచ్చిన ప్రభుత్వం టీడీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన హావిూలపై కేంద్రంతో పోరాడుతున్నామని అన్నారు. తుపాన్‌ వస్తే, రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడికి రారని, గుంటూరులో పార్టీ ఆఫీస్‌ ప్రారంభోత్సవానికి మాత్రం వస్తారని చంద్రబాబు కేంద్రంపై మండిపడ్డారు. పుండు విూద కారం చల్లి సంతోషిస్తున్నారని, విభజన చట్టంలో పేర్కొన్న హావిూలు అమలయి ఉంటే తమకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. రాష్ట్రంలో కష్టాలకు, ఇబ్బందులకు ప్రధాని నరేంద్రమోదీయే కారణమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తెలుగుజాతి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ పరిమితిని రూ.5లక్షలకు పెంచుతున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ముందుకెళ్తున్నామని అన్నారు. కేంద్ర ¬ంమంత్రి ఈ రోజు కడపలో పర్యటిస్తున్నారని, ¬దా విషయంలో మోసం చేసి మళ్లీ ఎందుకు వచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ప్రకటించాలని చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.