పెన్షన్లపై ఇబ్బందులు తగవు

ఏలూరు,జనవరి3(జ‌నంసాక్షి): ప్రభుత్వం నిర్వహించే జన్మభూమి-మఊ/ూరు కార్యక్రమంలో పింఛనుదారులను ఇబ్బందులకు  గురిచేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఎప్పటిలాగే పంపిణీ జగాలని కోరారు.  గతనెల పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమచేయడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. ఈసారి పింఛను చేతికిస్తారని ఆశపడ్డారు. కానీ జన్మభూమి కార్యక్రమంతో పింఛనుదారులను జన్మభూమి సభల్లో ఇస్తామంటూ అక్కడకు పిలిచి అవస్థలకు గురిచేయడం దారుణమని పలువురు వాపోతున్నారు. గతంలో వార్డుల వారీగా పింఛన్లు పంపిణీ చేసేవారు. ఇప్పుడు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించడం వలన పింఛన్లు అక్కడే ఇస్తామని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో జన్మభూమి కార్యక్రమాలు ముగిసే వరకూ పింఛనుదారులకు అవస్థలు తప్పవని పలువరు పేర్కొంటున్నారు.