పెళ్లింట్లో డ్యాన్స్‌ చేస్తూ యువకుడి మృతి

వరంగల్‌ అర్బన్‌,మే10(జ‌నం సాక్షి):  జిల్లాలోని భీమదేవరపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి పెండ్లికి వచ్చిన రాజేష్‌(24) అనే యువకుడు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగి కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో ఆనంద, సంతోషాల నడుమ జరగాల్సిన పెండ్లి వేడుకలో విషాదం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. రాజేశ్‌ మృతితో పెళ్లింట్లో విషాదం అలముకుంది.