పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ బషీరాబాద్

సెప్టెంబర్ 25,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) ఆధ్వర్యంలో 16 మంది నిరుపేదలకు 7.34 లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న నిరుపేదలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి,వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రజాక్, ఎంపీటీసీ ల కోరమ్ అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, మాసన్ పల్లి సర్పంచు బీమప్ప,యువజన విభాగము అధ్యక్షులు తాహిర్ బాండ్,ఉపాధ్యక్షులు నితిన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నీళ్ళ పల్లి సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ అశోక్ గౌతం,బిఆర్ఎస్ నాయకులు సాయిల్ గౌడ్ గురుస్వామి,రవీందర్ సింగ్,నర్సిములు,రాజన్న,అవస్తి రవి ప్రసాద్, రాజేశ్వరరావు,సిద్దు,తదితరులు పాల్గొన్నారు.