పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ద- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ద- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, సెప్టెంబర్ 23, (జనంసాక్షి )
పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా అర్హులైన ప్రతి పేదవానికి ఆపద వస్తే ఆదుకుంటున్నాడని అన్నారు. దీనికి నిదర్శనం లబ్ధిదారుల సంఖ్య అని అన్నారు. గత ప్రభుత్వాలు కేవలం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయ్యేదని కానీ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అవుతుందన్నారు. చికిత్స చేయించుకునే స్థోమత లేనివారికి సైతం ఎల్ఓసి అందించి ఆదుకునే గొప్ప నాయకుడు కెసిఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ని గెలిపించి హ్యాట్రిక్ సీఎంగా కూర్చోబెట్టాలని పిలుపునిచ్చారు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని 15 మంది లబ్ధిదారులకు 9,75,000రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, ఎంపీటీసీ కలాలి శకుంతల, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, ఏస్సి సెల్ ప్రెసిడెంట్ దామెర కిరణ్, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…