పేదల పెన్నిధి కేసీఆర్

జుక్కల్ సింగిల్ విండో చైర్మన్ శివానంద్
జుక్కల్,సెప్టెంబర్2,జనంసాక్షి,
పేదల పెన్నిధి కేసీఆర్ అని జుక్కల్ సింగిల్ విండో చైర్మన్ శివానంద్ అన్నారు. ఆయన శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మాదాపూర్ గ్రామంలో కొత్త ఆసరా లబ్ధిదారులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు మన ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.సీఎం కేసీఆర్ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. ఆ తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి సబ్బండవర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణా అభివృద్ధిలో దూసుకు పోతున్నదని ఆయన అన్నారు.ఆసరా పింఛన్లు మంజూరికానివారు నిరా శ చెందవద్దని,జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సహాకారంతో అర్హులందరికీ ఇప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దినేష్, మండల ఎంపిటీసీల సంఘం అధ్యక్షురాలు అర్చన శివానంద్, తెరాస నాయకులు రాంచందర్,
రాజు పటేల్,సంగ్రాం పటెల్, నర్సింగ్ నాయక్ , ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.