పేదల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్ పార్టీ. – టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి.

బెల్లంపల్లి, నవంబర్ 24, (జనంసాక్షి )
పేదల శ్రేయస్సు కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 30వ వార్డు మహ్మద్ ఖాసీం బస్తీలో గడపగడపకు ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, దీనికి నిదర్శనం మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు అందరు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టనున్న ఆరు గ్యారంటీ స్కీములను ఓటర్లకు వివరించి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవసరమో అవగాహనా పరిచారు. ఈకార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు తొంగల మల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం, నాయకులు ఆడెపు మహేష్, మారెల్లి శ్రీనివాస్, ఎండీ మాలిక్, గౌరయ్య, సతీష్, మహేష్, మేఘన, అనసూయ, వరలక్ష్మి, చంద్రకళ, రాజేశ్వరి, లత, శ్రీదేవి, పద్మ, స్రవంతి, సునీత, ఈశ్వరి, సుగుణ, రమ్య, సుశీల, సుమలత, మానస, సవిత, జానకి బాయ్, కవిత తదితరులు పాల్గొన్నారు.