పేద ప్రజలకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే.

త్వరలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 26 జనం సాక్షి.
గద్వాల పట్టణంలో నివసిస్తున్న అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేర్చలనే లక్ష్యంగా మంగళవారము గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందుకు సంబందించిన ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది.త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పేద ప్రజల కోసం ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా నిరుపేదలైన లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి పేద ప్రజల సొంతింటి కాలం నెరవేర్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, కౌన్సిలర్ మురళి, కృష్ణ, శ్రీను, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి కోటేష్, నాగులు యాదవ్ రంజిత్, సీతారాములు కృష్ణ వీరేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.