పేద ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా కేంద్రంలో పేద ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఊహించి ఆర్థికంగా ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర జిల్లాకు చెందిన 77 మంది బాధితులకు రూ.21,09, 500 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.