పేద విద్యార్థులకు అండగా ఉంటా :

ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పుట్లూరి రాజశేఖర్ రెడ్డి

తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 26 (జనంసాక్షి):
మండలంలోని పెద్దబాయితండ గ్రామపంచాయతీకి చెందిన జటావత్ ధర్మనాయక్ కుమార్తె జటావత్ అంజలి ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో ఎస్టి కేటగిరీ లో అల్ ఇండియా 3830వ రాంక్ సాధించింది.
అంజలి కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న తిరుమలగిరి సాగర్ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పుట్లూరి రాజశేఖర్ రెడ్డి 10000 రూపాయలు ఎన్నారై నెమలి మాధవరెడ్డి 5000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లో జన్మించి, ఊరికి ,పేద ప్రజలకు సేవ చెయ్యాలి అనే సంకల్పంతో బాగా చదివి నీట్ లో మంచి ఫలితం సాధించింది అన్నారు.
ఈ విజయాన్ని మిగతవారు కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
ఇలాంటి ప్రతిభ కనబరిచిన వారికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.