పేలిన మందుపాతర: గిరిజనుడికి గాయాలు
విశాఖపట్టణం,నవంబర్ 28(ఆర్ఎన్ఎ): ఎవోబిలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జి.మాడుగుల మండలం నుర్మతి సవిూపంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఓ గిరిజనుడికి గాయాలయ్యాయి. నుర్మతి పోలీస్ అవుట్ పోస్ట్ నిర్మాణాన్ని అపేందుకు మావోయిస్టులు మందుపాతర పేల్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మర్మతి అటవీప్రాంతంలో ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఈ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులే లక్ష్యంగా వండ్రంగి వంతెన వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు,మావోలకు మధ్య ఎదురుకాల్పులు సాగినట్లు సమాచారం.