పోగొట్టుకున్న చేరవాణి బాధితుడికి అందజేత.

బెజ్జూర్: గత కొద్ది రోజుల క్రితం బెజ్జూరు మండలంలోని సోమిని గ్రామానికి చెందిన లింగాల శంకరయ్య కు చెందిన చరవాణి పోగొట్టుకున్నాడు. దాంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా
పోలీసులు స్పందించి సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేయగా బాధితుడు యొక్క చరవాణి లభించింది. బెజ్జూర్ పోలీస్ స్టేషన్లో బాధితునికి ఎస్సై విక్రమ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మోహన్ నాయక్, హెడ్ కానిస్టేబుల్ శ్రీమంత్ పాల్గొన్నారు.