పోతిరెడ్డిపల్లి మీదుగా గుట్ట బస్సు నడపాలి

సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిరసన
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 14 : యాదగిరి గుట్ట వెళ్లే సిద్దిపేట డిపో బస్సును పోతిరెడ్డి పల్లి గ్రామం మీదుగా నడపాలని కోరుతూ శుక్రవారం సీపీఐ (ఎం) పార్టీ ఆధ్వర్యంలో పోతిరెడ్డి పల్లి క్రాసింగ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలు, ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు నిత్యం వస్తూ వెళ్తుంటారని అదే బస్సులో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి  బస్సు వచ్చే విధంగా తగు  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కత్తుల నరసింహారెడ్డి, జింకల బాలమల్లు, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, మరియాల సత్తయ్య, మెర్గోజు కృష్ణమూర్తి, మెర్గోజు కనకచారి, జింకల హరికృష్ణ, గర్నపల్లి రాజు, పోరెడ్డి కనకయ్య, మహేష్, సురేష్, రాజు, రాజు కుమార్, నవీన్, నరేష్, కమలాకర్, ప్రశాంత్, కనకయ్య, అశోక్, బిట్టు, రాజు, రమేష్, ఎండి.జహంగీర్, ఆరుట్ల లింగం తదితరులు పాల్గొన్నారు.
Attachments area