పోరు కొనసాగుతుంది

3

– జేఏసీ చైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌,మార్చి17(జనంసాక్షి):ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న కరువు పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేవరకు పోరు కొనసాగుతుందని జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. జిల్లాలో సీడ్‌ పత్తి రైతుల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విత్తనాల కొనుగోలులో ప్రభుత్వమే బాధ్యత తీసుకుని నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం డిమాండ్‌ చేశారు. జేఏసీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హావిూలు నెరవేరేలా పోరాడుతామని కోదండరాం అన్నారు. సమస్యలపై తమ పోరాటం ఆగదన్నారు. అలాగే సమస్యలను కూడా ఎప్పటికప్పుడు సర్కార్‌ దృష్టికి తీసుకుని వెళతామన్నారు.