పోలవరం సందర్శన యాత్ర

కాకినాడ,జనవరి22(జ‌నంసాక్షి): కాకినాడ గ్రావిూణ శాసన సభ్యులు పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో మంగళవారం ‘ పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర ‘ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో.. కాకినాడ రూరల్‌ నుండి 26 ఆర్‌టిసి బస్సులు బయలు దేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్ట్‌ను చూసి దాని అభివృద్ధిని మిగిలిన ప్రజలకు తెలియజేసి 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని చేకూర్చే దిశగా పయనించాలనే ఉద్దేశంతో ఈ యాత్రను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.