పోలీసు అధికారిని హతమార్చిన అకాలీదళ్‌ నేత అరెస్టు

అమృత్‌సర్‌  : స్థానిక శిరోమణి అకాలీదళ్‌ నేత రంజిత్‌ సింగ్‌ రాణాను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు ఉద్యోగి ని అయిన తన కుమార్తెను రాణా మిత్రబృందంతో కలిసి తరచూ వేధిస్తుండడంతో పోలీసు అధికారి రవీందర్‌పాల్‌సింగ్‌ రాణా నివాసానికి వెళ్లి అది మంచి పద్ధతి కాదని, నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆగ్రహం చెందిన రాణా ఆ అధికారిని అక్కడికక్కడే హతమార్చినట్లు సమాచారం. బుధవారం పట్టపగలు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహంపెల్లుబికింది. పోలీసులు ఈ రోజు రాణాను, అతని మిత్రులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.