పోస్టులను పెంచి వయోపరిమతీ పెంచాలి
గుంటూరు,నవంబర్19(జనంసాక్షి): పోస్టుల సంఖ్య వయోపరిమితి పెంపుకై డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గుంటూరులో సోమవారం నిరసన దీక్ష నిర్వహించారు. పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ వి.బాల సుబ్రహ్మణ్యం, ఎంఎల్సి వాము సూర్యారావులు ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్సి బడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉద్యోగాల పోస్టుల సంఖ్య పెంచాలని, వయో పరిమితిని పెంచాలని కోరారు. 22 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ కేవలం 7907 పోస్టులకు మాత్రమే నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యల్ని పరిష్కరించకపోతే చలో అమరావతి చేపడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్సి కెఎల్ లక్ష్మణ్రావు, ఎంఎల్సి బడ్డు నాగేశ్వరరావు, యుటిఎఫ్ నాయకులు, డివైఎఫ్ఐ నాయకులు, తిరుపతి నెల్లూరు ప్రకాశం ఎంఎల్సి విఠపు బాలసుబ్రహ్మణ్యం, గోదావరి జలాల ఎంఎల్సి రాము సూర్యారావులు పాల్గొన్నారు.