ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.

జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ చౌహన్.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 25 జనం సాక్షి.
ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం నూతన ఐ డి ఓ సి సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజావాణి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదుల ను స్వీకరించారు. ధరణి సమస్యలపై, వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్ల పై మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయని. ప్రజల నుండి వచ్చిన పిర్యాదుల లో ఆసరా పెన్షన్ కు సంబంధించి 14 ధరఖాస్తులు , భూ సమస్యలు , ఇతర సమస్యల కు సంబంధించి 70 ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వచ్చిన ప్రజా ఫిర్యాదులన్నింటిని సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కరామయ్యేలాచూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను జిల్లా అధికారులు సంబంధిత మండలాల తహసిల్దార్లు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్క రించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కి వస్తున్న ప్రతిఒక్కరికి దరఖాస్తుఫై సంబంధిత అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలోఎస్ డి సి సుబ్రహ్మణ్యం ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.