ప్రజా సంక్షేమ బడ్జెట్‌

5

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి14(జనంసాక్షి):  ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్ర అసెంబ్లీలో 2016-17 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై  సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పందించారు. ఇది ప్రగతికాముక బడ్జెట్‌ అని అభివర్ణించారు. బడ్జెట్‌ రూపొందించిన ఈటల రాజేందర్‌ను ఆయన అభినందించారు. అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ సమతుల్యత సాధించారని కితాబిచ్చారు. సాగు నీటి పారుదల, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం సముచితమని పేర్కొన్నారు. సమైక్యపాలనలో ప్రణాళికా పద్దుల కింద రాష్టాన్రికి రూ.9 వేల కోట్లే ఇచ్చారని గుర్తు చేశారు.