ప్రణబ్‌కు పలువురు శుభాకాంక్షలు

3

న్యూఢిల్లీ,డిసెంబర్‌11(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రణబ్‌ దేశానికి వెలకట్టలేని సంపద అని మోదీ అభివర్ణించారు.  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ  81వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రణబ్‌ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు మోదీ ట్విట్‌ చేశారు. వివేకం, మేధస్సు సమపాళ్లు కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు. ప్రణబ్‌ గౌరవప్రదమైన నాయకుడని, ఆయన దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ కొనియాడారు.  కాగా, ప్రణబ్‌ జన్మదినం సందర్భంగా వివిధ రాష్టాల్ర గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 1935 డిసెంబర్‌ 11న ప్రణబ్‌ పశ్చిమ బెంగాల్‌ లో జన్మించారు.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రణబ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రణబ్‌ముఖర్జీ ఆయురారోగ్యాలతో శత వసంతాలు పూర్తి చేసుకోవాలి. ఆయన ప్రజలకు మరిన్ని సేవలందించేలా ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. యూపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాతో పాలు పలువురు ప్రణబ్‌ను క లసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ కేకే పాల్‌ తదితరులు రాష్ట్రపతిభవన్‌ను వెళ్లి ఆయనకు స్వయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌, దిల్లీ, పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రులు

కేజీవ్రాల్‌, మమతాబెనర్జీ రాష్ట్రపతికి ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వారు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.