ప్రతిష్ఠ లో పాల్గొన్న తాజా, మాజీ ఎమ్మెల్యేలు

చండ్రుగొండ జనంసాక్షి(ఆగస్ట్ 07) : మండల కేంద్రమైన చండ్రుగొండలో  వైభవంగా సాయిబాబా  మహాలక్ష్మీ   అమ్మ వారు  ధ్వజస్తంభం 5రోజుల    ప్రతిష్టా మహోత్సవాలు ఆదివారం తో ముగిశాయి  ఈ కార్యక్రమాలకు   దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు    అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యుడు  మెచ్చా నాగేశ్వరరావు, మాజీ శాసన సభ్యులు  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు  తాటి వెంకటేశ్వర్రావు   పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటైన  విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి   వెంట  టీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల   మండల  నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.