ప్రతి ఒక్కరు బూస్టర్ డోసు వేసుకోవాలి

సర్పంచ్ ఉదయశ్రీ
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై (జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి గ్రామంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బూస్టర్ డోస్ కరోనా టీకాల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ టీకాను వేసుకొని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి దశలవారీగా రూపాంతరం చెందుతూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ మహమ్మారిని తరిమి కొట్టడానికి కరోనా టీకాలు ఒకటి రెండు వేసుకొని ఆరు నెలలు నిండిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకొని కరోనాను పూర్తిగా తరిమి కొట్టాలని నిండా ఆరోగ్యం కోసం గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరు టీకాలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వైద్య సిబ్బంది అంగన్వాడి ఆయాలు గ్రామంలోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area