ప్రతి ఒక్కరు హరితహారంలో భాగస్వాములు కావాలి

– సర్పంచుల సంఘం మండల ఉపాధ్యక్షురాలు మఠం ప్రమీల చంద్రశేఖర్
, జులై 18( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపల్  గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులందరికీ సర్పంచ్ మఠం ప్రమీల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మరియు వ్యవసాయ పొలంలో మొక్కలు విధిగా నాటి వాటిని సంరక్షించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ స్వరూప, అంగన్వాడీ టీచర్ అనసూయ, టిఆర్ఎస్ యువ నాయకులు మఠం రాజశేఖర్  మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది.