ప్రధాన ప్రచారంగా ప్రాజెక్టుల రీ డిజైన్‌

‘కాళేశ్వరం నీళ్లు కావాలా.. కాంగ్రెస్‌ పార్టీ క్వార్టర్‌ కావాలా?’ అంటూ టీఆర్‌ఎస్‌ ప్రచారం సాగిస్తున్నది. కాళేశ్వరానికి రాష్ట్రం జాతీయ ¬దానే అడగలేదని ఇటీవల కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించగా, జాతీయ ¬దాపై కేంద్రానికి రాసిన లేఖను మంత్రి హరీశ్‌ రావు విడుదల చేసిన తీరు చూస్తుంటే మరోమారు ఈ అంశం తాజాగా ప్రచారంలో ప్రధానంగా మారింది. అభ్యర్థులను ప్రకటించకున్నా జిల్లాల్లో కాంగ్రెస్‌ ప్రచారంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అధికార టిఆర్‌ఎస్‌ అక్రమాలను ఎండగడు తూనే ఉంది. ప్రాజెక్టుల రీ డిజైన్‌ల పేరుతో వేలకోట్లు బొక్కారన్న ప్రచారం చేస్తోంది. ఇంకా సెంటిమెంట్‌తో ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. చేతగాక 9 నెలలముందే కెసిఆర్‌ కాడి పడేశారని విమర్శలు గుప్పిస్తోంది. ఇకపోతే టిఆర్‌ఎస్‌ కూడా ప్రాజెక్టులపైనే ప్రధానంగా విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్‌ ఎందుకు ప్రాజెక్టులు కట్టేలేదని నిలదీస్తోంది. మహాకూటమికి ఓట్లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయినట్టేనని టిఆర్‌ఎస్‌ నేతలు ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆ ప్రాజెక్టును ఆపాలంటూ 30 లేఖలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అత్యంత జుగుప్సాకరంగా కాంగ్రెస్‌తో జతకట్టి తెలంగాణ నీళ్లు, నిధులను మరోసారి దోచుకుపోవడానికి బయలుదేరాడని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెసోళ్లు కోర్టు మెట్లు ఎక్కారని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల వ్యవహారం ఇప్పుడు ప్రచారంలో ప్రధానంగా మారింది. బాబు ప్రాజెక్టులను అడ్డుకున్నాడని, అలాంటి బాబుకు కాంగ్రెస్‌ జుట్టు అందిస్తోందని చెబుతోంది. అంతరాష్ట్ర నదీ జలాల అంశం సైతం రెండు పార్టీల మధ్య ప్రచారాస్త్రంగా మారింది. పాలమూరు, డిండి, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఆపాలంటూ పదేపదే కేంద్రానికి, బోర్డులకు లేఖ రాస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. అలాంటి బాబుతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చేతులు కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని దుయ్యబడుతోంది. కాంగ్రెస్‌,టీడీపీ మైత్రి మరింత బలపడుతున్న నేపథ్యంలో ఏపీ సృష్టిస్తున్న అడ్డంకులు, తుంగభద్ర నదిపై అడ్డగోలుగా చేపడుతున్న ప్రాజెక్టుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా టీఆర్‌ఎస్‌ ఉంది. ఇప్పటికే తుంగభద్రపై కేంద్రానికి లేఖ రాసింది. ప్రాజెక్టులే ప్రధానాస్త్రాలుగా ఇరు పార్టీలు ప్రచారంలో దూసుకుని పోతున్నాయి. జిల్లాల్లో ఇప్పుడిదే ప్రధాన ప్రచారాస్త్రంగా మరింది. ఉమ్మడి వంరంగల్‌ జిల్లాలో దేవాదుల ద్వారా చెరువులను నింపిన ఘనత టిఆర్‌ఎస్‌దని ఈ ప్రాంత నేతలు ప్రచారం చేస్తున్నారు. నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమంటున్నారు. గోదావరి జలాలతో చేరువులు నింపడమే లక్ష్యంగా పని చేస్తామని హావిూ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో 365 రోజులు చేరువుల ద్వారా మత్తళ్లు పారిస్తామన్నారు. ఇలా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు కాళేశ్రం నిర్మిస్తుంటే కాంగ్రెస్‌ వాళ్లు కేసులతో కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ప్రచారంలో నేతలు మండిపడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాణహిత,చేవెళ్ల ప్రాజెక్టు అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఈ ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌ను కాంగ్రెస్‌ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్లుగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే పక్రియ ఆర్థిక, పర్యావరణ, నిర్వహణ పరంగా అనుసరణీయం కాదని కాంగ్రెస్‌ వాదిస్తోంది. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో చర్చించాకే దీనిపై ముందుకెళ్లాలని కోరినా అదేవిూ పట్టనట్లు వ్యవహరించి ప్రాణహితను విభజించి పూర్తిగా పక్కనపెట్టారని కాంగ్రెస్‌ తన ప్రచారంలో ¬రెత్తిస్తోంది.

దీనికి టీఆర్‌ఎస్‌ ధీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తోంది. పాత డిజైన్‌ మేరకు 56 వేల ఎకరాలకే నీరిచ్చే

అవకాశం ఉందని, తాము రీ డిజైన్‌లో ఆయకట్టును 2 లక్షలకు పెంచామని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ప్రచారం చేస్తున్నారు. ప్రాణహితకు కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లలో రాని అటవీ, వన్యప్రాణి విభాగ అనుమతులు తాము సాధించామని చెబుతున్నారు. హబూబ్‌నగర్‌ జిల్లాలోనూ ప్రాజెక్టులే ప్రచారాం శంగా మారాయి. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌తో పాటు కొత్తగా చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు తమవంటే తమవంటూ కాంగ్రెస్‌,టీఆర్‌ఎస్‌ ¬రెత్తిస్తున్నాయి. ప్రాజెక్టు పనులు అత్యధికంగా తమ హయాంలోనే పూర్తయ్యాయని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంటే.. పదేళ్లలో కాంగ్రెస్‌ పది వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వలేకపోయిందని, తాము అధికారంలోకి వచ్చాకే జిల్లాలో 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని టీఆర్‌ఎస్‌ చెబుతోంది. అంచనా వ్యయాలను పెంచేందుకే ప్రాజెక్టుల్లో మార్పులు చేశారని కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఎస్‌.జైపాల్‌రెడ్డి, అరుణ, రేవంత్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి ఆరోపిస్తుండగా, వలసలు వాపస్‌ వచ్చేలా పనులు చేస్తున్నామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ¬రెత్తిస్తున్నారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌.. తప్పుడు కేసులతో కాంగ్రెస్‌ ప్రాజెక్టులను అడ్డుకుం టోందని విమర్శలు గుప్పించారు. కవిూషన్ల కోసం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచారు. మెజార్టీ పనులను ఆంధ్రా కాంట్రాక్టు సంస్థలకే కట్టబెట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం రూ.లక్ష కోట్లకు పెంచారు. కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టుకే పేరుమార్చి రీ డిజైన్‌ చేశారని, ఇదంతా కమిషన్ల కక్కుర్తి కోసమే అని ఆరోపిస్తున్నారు. అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపిందని మంత్రి హరీశ్‌రావు వాదిస్తున్నారు. విూ హయాంలో ప్రాణహితను ఎందుకు సాధించలేదని కూడా నిలదీస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టుల రీ డిజైన్‌ ఇప్పుడు ప్రచారంలో ప్రధాన అంశంగా మారింది. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లు దీనిపై పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల ప్రచారం ఎవరిని ముంచుతుందో డిసెంబర్‌ 11న ఫలితాల్లో వెల్లడి కానుంది.