ప్రభుత్వం భూమిలో అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేయండి

ప్రభుత్వ ఆస్తులను కాపాడండి

ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ : మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్య గూడెంలో సర్వేనెంబర్ 92 లో గల ప్రభుత్వ భూమిలో ఇదే గ్రామానికి చెందిన బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి అక్రమంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడని, అక్రమ కట్టడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని గ్రామానికి చెందిన దళితులు మంగళవారం నేరేడుచర్ల తహసీల్దార్ సైదులుకు వినతి పత్రం అందజేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టు తున్నారని వారు ఆరోపించారు.తహశీల్దార్ కు ఫిర్యాదు చేసిన నిర్మాణం ను అడ్డుకోవడం లేదన్నారు.
ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేస్తుంటే మున్సిపాలిటీ అధికారులు ఎందుకు అడ్డుకోలేదని కోలేదని వారు ప్రశ్నించారు. ఈ స్థలము అంబేద్కర్ కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి కేటాయించారని వారు తెలిపారు.