ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారాన్ని అందించిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కిరణ్ ఫౌండేషన్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

బైంసా  ప్రభుత్వ ఆసుపత్రిలో  ప్రతిరోజు ఉదయం అల్పాహారం అందజేత.డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైంసా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు కొన్ని వందల మంది రోగులు వారి యొక్క సమస్యల నిమిత్తం వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు వారికి ఉదయం సమయంలో.   బైంసా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి రోగులు రావాలి కాబట్టి ఉదయం అల్పాహారం చేయకుండా వస్తారు దానికి గాను చికిత్స తీసుకుంటున్నప్పుడు రోగులు కళ్ళు తిరగడం ట్రీట్మెంట్లో సరిగా అందుకోలేకపోవడం  వలన వారి కష్టంను గుర్తించి కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ ఆవరణంలో ఉన్నటువంటి రోగులకు ప్రతిరోజు వారితో పాటు ఉన్న అటెండర్లకు అల్పాహారం అందిస్తున్నామని కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కిరణ్ గారు తెలిపారు.అదేవిధంగా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి గారు మాట్లాడుతూ వంద పడకల ఆసుపత్రిలో వందల మంది రోగులు  వస్తున్నారు. వారికి ఒక పూట కడుపునిండా అన్నం పెట్టడానికి ఆలోచించినటువంటి కిరణ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా. ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి గారి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి కృష్ణ గారు డాక్టర్ కాశీనాథ్ గారు సూపర్డెంట్ ఆఫ్ హాస్పిటల్. ఎంపీపీ కల్పన గణేష్ గారు తోట రాము మున్నూరు కాపు మిత్రమండలి అధ్యక్షులు కాశీనాథ్  మున్నూరు కాపు  తాలూకా అధ్యక్షులు రోళ్ల రమేష్ పాల్గొన్నారు