ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే సుమోటోగా స్వీకరిస్తా

లోకాయుక్తకే వన్నె తెస్తా : సుభాషన్‌రెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : అధికారులు అవినీతికి పాల్పడితే సుమోటోగా కేసులు నమోదు చేస్తామని నూతనంగా నియమితుడైన లోకాయుక్త జడ్జి సుభాషణ్‌రెడ్డి అన్నారు.  గురువారం ఆయన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారులు నిజాయితీతో వ్యవహరించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే ఉపేక్షించమని సుభాషణ్‌రెడ్డ్డిి హెచ్చరించారు.