ప్రయాణికుడి నుంచి అర కిలో బంగారం స్వాధీనం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద నుంచి అర కిలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద తనిఖీలు చేపట్టగా బంగారం లభ్యమైనట్లు తెలిపారు.