ప్రశాంతంగా ముగిసిన టిఎస్ పి ఎస్సీ గ్రూపు వన్ పరీక్షలు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శశాంక.

ఆలస్యంగా వచ్చిన అభ్యర్థికి చుక్కెదురు.

తొర్రూరు   అక్టోబర్ 16(జనంసాక్షి ) రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రోజు టిఎస్ పి ఎస్సీ  గ్రూపు వన్ పరీక్షలు జరిగాయి పట్టణంలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు  తొర్రూర్ పరీక్ష కేంద్రాల పర్యవేక్షకులు తాసిల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి తెలిపారు . కాగా యొక్క పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ విచ్చేసి సందర్శించారు  సమత  డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థుల ప్రవేశ సమయము ఉదయం గం 10.15 ని లు  కాగా చెందిన  అభ్యర్థి  3 ని లు  ఆలస్యంగా రావడంతో అనుమతికి నిరాకరించారు దీంతో అభ్యర్థి నిరాశకు గురై  వెనుతిరిగాడు. కాగా  ఈ పరీక్షలకు చంటి పిల్లలతో విచ్చేసిన మహిళలు  పోలీస్ శాఖలు పనిచేసిన వారు కూడా గ్రూప్ వన్ పరీక్షలు అయ్యారు సమత డిగ్రీ కళాశాల కేంద్రం లో  540 కు గాను  410 మంది  అభ్యర్థులు, సాయి రామ్  కళాశాల లో 294 కు గాను 230 మంది  అభ్యర్థులు హాజరయ్యారు అని తాసిల్దార్ రాఘవరెడ్డి తెలిపారు ఈ యొక్క పరీక్షలను జిల్లా కలెక్టర్ శశాంక, ఆర్డిఓ రమేష్, ఒక లైజేనింగ్ ఆఫీసర్,ఇద్దరు చీఫ్ సూపరేండెంట్ లు, ఇద్దరు సహాయ లైజేనింగ్ ఆఫీసర్ లు పరీక్ష నిర్వహించినారు. మహబూబాబా ద్  డిఎస్పి డి.రమణబాబు  సి ఐ వై సత్యనారాయణ , దంతాలపల్లి ఎస్సై జగదీష్, ఎస్సై జితేందర్ మరియు రెవెన్యూ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.