ప్రసాద స్కీమ్‌లో జోగులాంబను చేర్చండి: ఎంపి జితేదంర్‌ రెడ్డి

న్యూఢిల్లీ,జూలై30(జ‌నం సాక్షి):జోగుళాంబ శక్తిపీఠాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రసాద్‌ స్కీంలో చేర్చాలని ఎంపీ జితేందర్‌ రెడ్డి కోరారు. జోగుళాంబ ఆలయాన్ని సందర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారని, కాబట్టి ఈ పథకంలో చేర్చితే టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. లోక్‌ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో జితేందర్‌ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై లిఖిత పూర్వకంగా తమను సంప్రదించాలని టూరిజం శాఖ మంత్రి సమాధానమిచ్చారు.