ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

వనపర్తి,మే5(జ‌నం సాక్షి ):  జిల్లాలోని కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలంలోని శ్రీరామ్‌ నగర్‌ రైల్వేస్టేషన్‌ సవిూపంలో రైలు కింద పడి విక్రమ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని స్థానికుల సమాచారం. విక్రమ్‌, సుస్మిత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరువురు కుటుంబ పెద్దలు అంగీకరించకలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సుస్మిత నిన్న రాత్రి 11 గంటలకు గుళికల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని విక్రమ్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.