ప్లాస్టిక్‌ గోదాములో భారీ అగ్నిప్రమాదం

ఒంగోలు,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లా ఒంగోలులో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక గుంటూరు రోడ్డులోని పాపా రైస్‌ మిల్లు సవిూపంలో ఉన్న ఓ ప్లాస్టిక్‌ వస్తువుల పాత సామాను గోదాములో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు అలముకున్నాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గోదాము పూర్తిగా దగ్ధమయ్యింది. లోపల ప్లాస్టిక్‌ నిల్వలు ఎక్కువగా ఉండడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడుఫైరిరజన్లతో మంటలను అదుపు చేశారు. గోదాములోని ప్లాసిక్‌ నిల్వలతో పాటు మూడు యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని భావిస్తున్నారు. దీంతో అధికారులు ఊపరి పీల్చుకున్నారు. ప్రమాదకారణాలను ఆరా తీస్తున్నారు.