ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న టిపిసిసి కార్యదర్శి దండెం రాంరెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై లో 18(జనంసాక్షి):-ఇబ్రహీంపట్నం , మున్సిపాలిటీ కేంద్రంలో  నిన్న రాత్రి మహంకాళి మత దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి గారు, తదనంతరం కాళీమాత యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి కాళీమాత యువసేన కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పాల్గొని, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది, పోతురాజు నృత్యాలు, యువకుల కోలాహలంతో ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు కొనసాగింది.
ఈ సందర్భంగా దండెం రాంరెడ్డి  మాట్లాడుతూ… అమ్మవారి దయతో అందరూ బాగుండాలని, వర్షాలు సమృద్దిగా పడి రైతన్నల ఇంట పంట సిరులు కురవాలని, దైవానుగ్రహంతో ప్రజలంతా ఎటువంటి రోగాల బారిన పడకుండా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్ను గోవర్దన్ రెడ్డి , కప్పటి రఘు, అలీ భాయ్, రాజు, మహేందర్, టిల్లు, పండుగుల రాము, నర్సింగ్, రాహుల్, రామ్ సాగర్, సౌండ్ శ్రీను, శ్రీదర్, అక్షయ్, మనీష్. కాళిమాత యువసేన కమిటీ సభ్యులు. వికాస్, సునీల్ రెడ్డి, అక్రమ్, ప్రవీణ్, వంశీ, ఉదయ్, విష్ణు, ముకేష్, ప్రేమ్,శశి, పవన్” మరియు యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.