ఫిల్మ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ కార్యాలయంపై దాడితో మాకు సంబంధం లేదు

హైదరాబాద్‌: ఫిల్మ్‌నగర్‌లోని జూనియర్‌ ఎన్టీఆర్‌ కార్యాలయంపై జరిగిన దాడిని తెలుగు యువత నాయకులు ఖండించారు. ఈఘటనతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, నందమూరి వంశానికి, నారా వంశానికి మధ్య మనస్పర్థలు రేపడానికి జరిగిన సంఘటనగా వారు అభివర్ణించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వారే ఇలా చేసి తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు.