ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు.

ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 23 జనం సాక్షి.ఫుట్బాల్ సీనియర్ క్రీడాకారుడు సంస్కార్ స్కూల్ కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని దగ్గర అల్పాహారం ఏర్పాటు చేయడమైనది.అల్పాహార కార్యక్రమాన్నీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యాయులు బండల పద్మావతి వెంకట రాములు,కౌన్సిలర్ బండల పాండు ప్రారంభించారు. అంతకుముందు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.అల్పాహార కార్యక్రమం ముగించిన అనంతరం కౌన్సిలర్ బండల పాండు ఆధ్వర్యంలో ఘనంగా గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ సురేష్, ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్, ప్రవీణ్ సేవా సమితి ప్రెసిడెంట్ ఇండికా శివ, ఫుట్బాల్ సీనియర్ క్రీడాకారులు జగన్, రమణ,ఆనంద్, రాజారెడ్డి, చిన్న ,ప్రదీప్, హలీం,వంశీ , పరుష, ప్రసాద్, జూనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.