ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత

ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని డిప్యూటీ కమిషనర్ రాజు,డిప్యూటీ సిటీ ప్లానర్ గజానంద్ అన్నారు.నేరెడ్ మెట్ చౌరస్తాలో ఫుట్ పాత్ లను ఆక్రమించుకొని ఇంటి యజమానులు అద్దెకు ఇస్తున్నారని దీంతో వాహనదారులు,పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారనీ ఫిర్యాదు అందడంతో ఫుట్ పాత్ ఆక్రమణలను పోలీస్ బందోబస్తుతో తొలగించామని తెలిపారు.ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సీఐ నరసింహ స్వామి,టౌన్ ప్లానింగ్ అధికారులు తుల్జా సింగ్,బిక్షపతి, పోలీస్,జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.