ఫైజాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు….

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి..

ప్రత్యేక పూజలు చేసిన అన్నదాత అంతి రెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి…

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :-
మండలం పరిధిలోని ఫైజాబాద్ గ్రామంలోని వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి వారు వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామాలలో వాడవాడల వెలిసిన వినాయకుడి నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి మండపాల వద్ద ప్రత్యేక అలంకరణలు అన్నదాన కార్యక్రమాలు, హెూమాలు వివిధ రకాల పూజలు నిర్వహిస్తూ విఘ్నాలను తొలగించే వినాయకుడికి భక్తి శ్రద్ధలతో భక్తులంతా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు సోమవారం నాడు ఫైజాబాద్ లోని విగ్నేషిని వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సంతా లక్ష్మారెడ్డి విఘ్నేశ్వరుని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు,గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేసిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకొని అన్నదానాలను ఆశీర్వదించారు. వారిపై ఎల్లప్పుడు గణనాధుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆయా గ్రామాలలోని సర్పంచులు యూత్ సభ్యులు,గ్రామా పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.