ఫైర్ స్టేషన్ మంజూరు కోసం డిప్యూటీ సీఎం కు విజ్ఞప్తి

బోథ్ కు ఫైర్ స్టేషన్ ను మంజూరు చేయాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని  రూ. 112కోట్లతో రోడ్ల ప్రతిపాదనల తో పాటు పార్ట్ టైం టీచర్ల సమస్యలతో కుడిన వినతి పత్రాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు సమర్పించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ వినతులపై ప్రభుత్వం నుండి మంజూరు కల్పించేలా సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.