ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

గద్వాల నడిగడ్డ అక్టోబర్ 2 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసిమేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ జయంతి ని జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షులు ఎస్ ఎస్ శేఖర్,టౌన్ అధ్యక్షుడు గిరి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ కార్యాలయంలో గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు,జిల్లా ఉపాధ్యక్షుడు కొంకతి వెంకటేష్ ,టౌన్ ఉపాధ్యక్షుడు వీరేష్, కార్యదర్శి అంజి, టౌన్ ప్రధాన కార్యదర్శి కిషోర్ రెడ్డి, ఫోటోగ్రాఫర్లు రఘు,శశి, జిల్లా కోశాధికారి వేణు,నరసింహ, బాలు,వెంకటేష్ ,రమేష్ మస్తాన్ ,భరత్ ,పవన్ తదితరులు పాల్గొన్నారు.