ఫ్రాన్స్‌ చర్చిలో కాల్పుల కలకలం

పారిస్‌: ఫ్రాన్స్‌లోని రోవన్‌ నగరంలో ఓ చర్చిలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. కొద్దిసేపు చర్చిలోని వారిని బందీలుగా చేసుకున్నారు. సాయుధులైన దుండగుల దాడిలో ఒకరు మరణించారు. ఓ దుండగుడిని హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. చర్చిలోని మతబోధకుడు, ఇద్దరు నన్స్‌, మరో ఇద్దరు లేదా ముగ్గురు చర్చికి వచ్చిన వారిని బందీలు చేసినట్లు చెప్పారు. చర్చిలోపల తుపాకీ పేలిన శబ్ధాలు కూడా వినిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.