బంగారం కోసం కన్నతల్లి హత్య

కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు
కడప,డిసెంబర్‌31 (జనంసాక్షి) : బంగారం కోసం కన్నతల్లిని హతమార్చిన ఓ కన్నకొడుకు దారుణ ఘటన జరిగింది. శుక్రవారం ఓబులవారిపల్లి మండల పరిధిలోని శివ శంకరాపురం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రతీరోజూ తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రి టీ తాగేందుకు బయటకు వెళతాడు. అలాగే ఉదయం కూడా తండ్రి టీ తాగేందుకు బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కన్నతల్లి అలిశెట్టి నర్సమ్మ (60) ను కన్న కొడుకు రోకలి బండతో కొట్టి చంపాడు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు తెలపడంతో వెంటనే కోడూరు సిఐ విశ్వనాథరెడ్డికి తెలిపారు. ఓబులవారిపల్లి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. హంతకుడిని అదుపులోకి తీసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేటకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.