బడుగుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

మఖ్తల్ అక్టోబర్ 12 (జనంసాక్షి) బడుగు బలహీన వర్గాల అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్మని ఎమ్మెల్యే అన్నారు. కృష్ణ మండలంలోని సుగర్ లింగంపల్లి గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారునికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ట్రాక్టర్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారి ఆర్థిక అభివృద్ధికి సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, మాగునూరు మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు