బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడికి సన్మానం

బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడికి సన్మానం

పెద్దవంగర 26(జనం సాక్షి )
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల ఉన్నత పాఠశాలలో 2001 సంవత్సరం వరకు గణితశాస్త్ర ఉపాధ్యాయుడుగా తన అమూల్యమైన సేవలందించిన శ్రీనివాస్ మళ్ళీ 22 సవంత్సరాల తర్వాత పెద్దవంగర ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు. దాంతో పూర్వ విద్యార్థులు అయనను ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు 20 ఏండ్ల తర్వాత మళ్ళీ పాఠశాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలను పూర్వవైభవం తేవడంలో కృషి చేస్తానని,ఉన్నంత కాలంలో పాఠశాలకు కావలసిన అదనపు సౌకర్యాల గురించి తనదైన శైలిలో పోరాటం చేసి, విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందింస్తానన్నారు. .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు వేణు, నరసింహ, సురేష్, బాలాజీ, భద్రయ్య చారి, తదితరులు పాల్గొన్నారు