బయటినుంచి వస్తువులు వస్తాయనడం అర్ధరహితం: ప్రపుల్‌ పటేల్‌

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలతో బయటినుంచి వస్తువులు వస్తాయన్న వాదన అర్థరహితమని కాంగ్రెస్‌ ఎంపీ ప్రపుల్‌ పటేల్‌ అన్నారు. మన రైతులు, చిన్న వ్యాపారులు నష్టపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మెక్‌ డొనాల్డ్‌, కేఎఫ్‌సీ లాంటి సంస్థలతో రైతులకు మేలు జరిగిందని ప్రపుల్‌ పటేల్‌ అన్నారు.