బస్సులో రంపచోడవరం చేరుకున్న పవన్‌

రాజమహేంద్రవరం,నవంబర్‌24(జ‌నంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆర్టీసీ బస్సులో రంపచోడవరం పయనమయ్యారు. నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను తెలుసుకొనే దిశగా తన రాజమహేంద్రవరం నుంచి బస్సు ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ మధ్యాహ్నం రాజమహేంద్రవరంలో బయల్దేరిన ఆయన గుడాల, కోరుకొండ, గోకవరం విూదుగా రంపచోడవరానికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో పలు గ్రామాల్లో గిరిజనులతో పవన్‌ మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.ఈ బస్సు ప్రయాణంలో ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు జనసేన నేత, మాజీ మంత్రి బాలరాజు తదితరులు ఉన్నారు.