బస్సు ప్రమాదంలో 15మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖైబర్ ఏజెన్సీలోని బజార్ జఖాఖేల్ ప్రాంతంలో.. ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. మరికొందరు గల్లంతయ్యారు. అయితే.. మొత్తం బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయం తెలియరాలేదు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రమైన వరదలు సహాయక చర్యలకు అడ్డంకిగా మారాయి.

గత వారం పాకిస్తాన్లో కురిసిన భారీ వర్షాలతో సంభవించిన ఆకస్మిక వరదలతో వేరు వేరు ఘటనల్లో 20 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.