బాధిత కుటుంబానికి చేయూత

 కెఎస్అర్ ట్రస్ట్
దోమ జనవరి 9(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూరు  గ్రామానికి చెందిన జన్పపిసు హన్మంతు తల్లి  జన్పపీసు వెంకటమ్మ అనారోగ్యంతో మరణించారు. తమ స్వగ్రామం లో మరణించిన విషయం తెలుసుకొన్న కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజశ్వరమ్మ  ట్రస్ట్ చెర్మన్ శరత్ కుమార్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా  తమ అనుచరుల  ద్వారా అంత్యక్రియల తక్షణ అవసరాల కొరకై 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్ రావు,కండక్టర్ మల్లయ్య యాదవ్,ఎర్ర సారంగి, గుళ్ళ గుర్రప్ప,ఖదీర్ అలియాస్ (ఆన్ను), మహమూద్ ఖాన్, సారంగి బిచ్చయ్య,వెంకటయ్య, ఇస్వయ్య లక్ష్మయ్య,సాయిలమ్మ, తదితరులు పాల్గొన్నారు….