బాధిత కుటుంబానికి భరోసా ఆర్థిక సహాయం.

ముప్కాల్ (జనం సాక్షి )నవంబర్ 12 మండల పరిధిలోని నల్లూరు గ్రామంలో కొద్దిరోజుల కిందట చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడిన మోహన్ దాస్ అనే వ్యక్తి కుటుంబాన్ని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధితుని కూతురు పేరిట డిపాజిట్ చేసి ఆదుకున్నారు మృతుని కుటుంబానికి భార్య కూతురు కుమారుడు ఉన్నారు పేద కుటుంబం కావడం వల్ల సునీల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా ఆదుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట నల్లూరు సునీల్ యువసేన అధ్యక్షుడు వార్డు సభ్యులు చౌకే రాజేందర్ మరియు యువసేన సభ్యులు ఉన్నారు