బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తా…

మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి.
ఊరుకొండ, ఆగస్టు 11 (జనం సాక్షి):
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని.. ఊర్కొండ మండలంలో ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తానని మాదారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధ్యాప నిఖిల్ రెడ్డి అన్నారు. గురువారం ఊరుకొండ మండలంలోని మాదారం గ్రామానికి చెందిన అంకురి బక్కమ్మ(50) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, డి.ఎన్.ఆర్ యువసేన సభ్యుల ద్వారా సమాచారం తెలుసుకుని బాధిత కుటుంబానికి రూ.5000/- నగదును సమకూర్చారు. అట్టి నగదును కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీ ఎన్ ఆర్ సభ్యులు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిరుపేదలకు అండగా ఉంటూ, వారి బాధలను తన బాధలుగా అభివర్ణించుకుంటూ వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడమే తన లక్ష్యమని అన్నారు. తనకు ఉన్న దాంట్లో బడుగు బలహీన వర్గాల పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయడమే తన లక్ష్యమని తెలియజేశారు. కార్యక్రమంలో డీఎన్అర్ యువసేన సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మాదారం గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.