బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 26, జనం సాక్షి.

దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి సర్పంచ్ చిత్తరి గౌడ్ సోదరుడు అనారోగ్యంతో మృతి చెందిన లక్ష్మణ్, మల్లేశం పల్లి గ్రామంలో ఇటీవల ట్రాక్టర్ పై నుండి మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని, హైమద్ నగర్ గ్రామంలో జానీ మీయా కుటుంబాన్ని, అనారోగ్యంతో బాధపడుతున్న భూధయ్య, సత్తమ్మ కుటుంబాలను మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పబ్బ మాధవి, అశోక్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహిమోద్దిన్, మండల్ కోఆప్షన్ సభ్యులు హైమద్, ఏఎంసి డైరెక్టర్లు పబ్బ అశోక్ గుప్తా, నాగరాజు గౌడ్, సర్పంచ్లు దార సత్యనారాయణ,చిత్తరి గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ముత్యంగారి స్వామి, మంజుర్, జోడు శ్రీశైలం,తదితరులు పాల్గొన్నారు.